కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పరామర్శించారు. కోవూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి యద్దలపూడి నాగరాజు కుమారుడు మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే గ్రామ మాజీ సర్పంచ్ మాచవరపు పుల్లయ్య కుమారుడు మరణించగా, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటూరి విజయ్, ఇందుపూరు మురళి కృష్ణ రెడ్డి, గొర్రిపాటి నరసింహ, కే గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


