*పేద కుటుంబానికి వాసుపల్లి రూ. 5000 ఆర్థిక సాయం* …
* *ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం నింపిన మాజీ ఎమ్మెల్యే దాతృత్వం*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
దక్షిణ నియోజకవర్గ ఆపద్బాంధవుడు పేదల పెన్నిధి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరో పేద కుటుంబానికి రూ. 5000లు ఆర్థిక సాయం అందించి దాతృత్వం చాటుకున్నారు. *31 వ వార్డు గొల్లలపాలెం తెలగ కులానికి చెందిన ఆకేటి పవన్ కుమార్ అనారోగ్య పరిస్థితిని ఆ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్ ద్వారా తెలుసుకొని ఇంటికి వెళ్లి వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. మెడిసిన్ ఖర్చులకు తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఏ అవసరం ఉన్న తాను అందుబాటులో ఉంటానని వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు* . దక్షిణ నియోజకవర్గం లో పేదల కష్టంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, తన శక్తి మేరకు నిరంతరం ఆర్థిక సహాయం కొనసాగిస్తానని వెల్లడించారు. తాను పుట్టి, పెరిగిన దక్షణ నియోజకవర్గం తనకు ఎంతో ఇచ్చిందని, ఇంతటి వాడిని చేసినా తన దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండడం తన బాధ్యతని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డ్ కార్పొరేటర్ బీపీన్ జైన్, జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ కండెరుగుల అప్పలనాయుడు, జిల్లా స్టూడెంట్ విభాగం సెక్రటరీ మెహన్, మాజీ వార్డ్ ప్రెసిడెంట్ పెంటకోట నాగరాజు, పల్ల త్రినాధ్, శేఖర్, తణుకులు, గోవింద్, కొండా రామ,33వ వార్డ్ మాజీ కార్పొరేటర్ పత్చిరిపిళ్లి రాము, జిల్లా సెక్రటరీ ఆదివిష్ణు,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భరత్, 35వ వార్డ్ ప్రెసిడెంట్ అలుపన కనకరెడ్డి, గంగాధర్,37వ వార్డ్ ఇంచార్జి గంగళ్ల రామరాజు,సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్,చింతకాయల వాసు,సంతోష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


