-కుమ్మరపల్లిలో లబ్ధిదారురాలికి రూ. 39,205 చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్
-ప్రజల కష్టకాలంలో వెంటనే స్పందించడం ప్రభుత్వ లక్ష్యం: నాయకుల ఉద్ఘాటన
చిట్వేలి, డిసెంబర్ 8: పున్నమి ప్రతినిధి
ప్రజల అత్యవసర సమయాల్లో అండగా నిలబడి, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
-చెక్కు అందజేత:
చిట్వేలి మండలం, నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కట్ట సుమిత్ర చెందిన ఆర్థిక సాయం చెక్కును సోమవారం ఆమె స్వగృహం వద్ద అందజేశారు. సుమిత్ర గారికి రూ. 39,205/-(ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు) విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అరవ శ్రీధర్ పాటు, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి సంయుక్తంగా అందజేశారు.
-అరవ శ్రీధర్ గారి ప్రసంగం:
ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ… “కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే ఎంతోమంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. విద్య, వైద్యం వంటి అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫండ్ను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం కృషి చేయాలని” కోరారు.
-ముక్కా వరలక్ష్మి వ్యాఖ్యలు
ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ… “సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రజల కష్టకాలంలో నిజమైన ఆదారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం నేరుగా చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కష్టాల్లో ఉన్నవారు ధైర్యాన్ని కోల్పోకుండా, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. లబ్ధిదారురాలికి సాయం అందించడం తమకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
-పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో అధికార కూటమి (ఎన్డీఏ) నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల లబ్ధిదారురాలు సుమిత్ర గారు మరియు ఆమె కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతను తెలియజేశారు.


