
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
*పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులు* *ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ * *కేజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ వాణి మరియు ఇతర డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించాలని తెలిపిన వంశీ గారు* జాలరి పేట పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం చిన్నారులు చేరుకొన్న నేపథ్యంలో పక్కనే వంట జరుగుతున్న ప్రాంతంలో అనుకోని సంఘటన జరిగి వేడి నీళ్లు/గంజి 15 మంది పిల్లలు మరియు మహిళలు పై పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కేజీహెచ్ సూపర్డెంట్ వాణి గారికి మరియు సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని తెలిపారు.చిన్నారులకు అందుబాటులో ఉండేలా డాక్టర్స్ లో మరియు అధికారులకు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలకు తెలియజేశారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం నిమిత్తం విజయవాడ లో ఎమ్మెల్యే గారు వున్న విషయం విధితమే. ప్రస్తుతం చిన్నారులు కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స పొందుతున్నారు.

