చిట్వేల్ అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి )
పెనగలూరు మండలంలో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు , మదన్ మోహన్ తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు, అది చీకటిపై వెలుగు, దుఃఖంపై ఆనందం, అసత్యంపై సత్యం గెలిచిన ఈరోజు ఈ పండుగలో ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మరియు శాంతి నిండాలి” అని పేర్కొన్నారు.అతను ప్రజలను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవడానికి కూడా ప్రోత్సహించారు. చిన్న దీపాల వెలుగు మరియు మంచి సంకల్పాలు మన సమాజంలో ప్రేమ, ఐక్యత, మరియు సత్సంబంధాలను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అన్నారు.మదన్ మోహన్ చివరగా, పెనగలూరు మండలం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటిలో సంతోషం వెలిగాలని, ప్రతి మనసులో వెలుగు నిలవాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలతో తెలిపారు.


