పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి పంచాయతీలో ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ, మదన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్ పంపిణీకి సచివాలయం సిబ్బంది సహకారం అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నరసింహ, మదన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ప్రతి అర్హత కలిగిన వారికి సమయానికి అందేలా చూడాలని కోరారు. పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పింఛన్లు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పింఛన్లు పొందారు.


