శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కుల వివక్ష నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి పూలే దంపతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జ్యోతిరావు పూలే అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. అనంతరం టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పూలే బాటలో నడవాలి-యువతకు టిడిపి పట్టణాధ్యక్షుడు పిలుపు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కుల వివక్ష నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి పూలే దంపతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జ్యోతిరావు పూలే అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. అనంతరం టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

