కృష్ణా జిల్లా
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఎన్.ఎస్.ఎస్ విభాగం1,2 యూనిట్స్ వారు 23 -11 -2025 నుండి 29- 11 -2025 వరకు స్పెషల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది .ఈ క్యాంపు కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కంకిపాడు,ఉప సర్పంచ్, చిరంజీవి గారు, పునాదిపాడు పంచాయతీ కార్యదర్శి,డి .బాపూజీ గారు పాల్గొన్నారు.ఈనాటి ప్రత్యేక శిబిరంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు . ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ .కె. సరళ శ్రీమతి .టి .నాగరాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


