Saturday, 28 February 2026
  • Home  
  • పీఎం శ్రీ జెడ్‌పీ హైస్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
- అన్నమయ్య

పీఎం శ్రీ జెడ్‌పీ హైస్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 39వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు బి. దుర్గారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభంలో భారత ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్పూ లమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సి.వి. రామన్ 1928లో కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ స్మారకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించిందని పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి ఆలోచనా విధానంలో భాగం కావాలని సూచించారు.సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే విజ్ఞాన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపికైన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఏ. శివన్నారాయణ గౌడ్ మాట్లాడుతూ, “విజ్ఞానంలో మహిళలు వికసిత భారత్‌కు దారితీసే శక్తి” అనే థీమ్ ద్వారా మహిళా శాస్త్రవేత్తల పాత్రను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఉమెన్ ఇన్ సైన్స్” అంశంపై వ్యాసరచన, వక్తృత్వం, సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర మహోత్సవానికి ఎంపికైన ఉపాధ్యాయులు శివన్నారాయణ గౌడ్‌ను సన్మానించారు. సైన్స్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమగ్ర మహోత్సవంలో పాల్గొన్న 80 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 39వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు బి. దుర్గారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభంలో భారత ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్పూ లమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సి.వి. రామన్ 1928లో కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ స్మారకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించిందని పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి ఆలోచనా విధానంలో భాగం కావాలని సూచించారు.సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే విజ్ఞాన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపికైన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఏ. శివన్నారాయణ గౌడ్ మాట్లాడుతూ, “విజ్ఞానంలో మహిళలు వికసిత భారత్‌కు దారితీసే శక్తి” అనే థీమ్ ద్వారా మహిళా శాస్త్రవేత్తల పాత్రను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఉమెన్ ఇన్ సైన్స్” అంశంపై వ్యాసరచన, వక్తృత్వం, సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర మహోత్సవానికి ఎంపికైన ఉపాధ్యాయులు శివన్నారాయణ గౌడ్‌ను సన్మానించారు. సైన్స్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమగ్ర మహోత్సవంలో పాల్గొన్న 80 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.