ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలో ఈరోజు కరంటోళ్ల జన బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ అనిల్ కుమార్, జేఈఈ రాంబాబు ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్మెన్ రమేష్, కిషోర్, జేఎల్ఎంలు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. గ్రామంలోని 11 కెవి, ఎల్టీ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్లను తనిఖీ చేసి, లోపాల నివారణతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడేలా చర్యలు చేపట్టామని తెలిపారు.



