పున్నమి ప్రతినిధి కామారెడ్డి 26-3-2026
కామారెడ్డిలోని స్థానిక జి.ప.గంజ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు తమకు 5 సంవత్సరాల నుండి విద్యను అందించిన, జిల్లా పరిషత్ గంజ్ ఉన్నత పాఠశాలకు 2025-26 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు థ్యాంకింగ్ సమావేశంలో తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం లింగం గారికి ఉపాధ్యాయ బృందంకు బీరువాను బహుకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమందరినీ సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుల సేవలు మరుపురానివని, ఉపాధ్యాయుల ఋణం తీర్చుకోలేనిదని పిల్లలు అన్నారు. ఇలాంటి విద్యార్థుల సేవలకు గాను ఉపాధ్యాయ బృందం ఆశీస్సులు అందించారు. ఇట్టి సమావేశంలో సునీత మేడం, రాజేంద్ర, గీత, రాజేందర్ రాధాదేవి మొదలగు వారు పాల్గొన్నారు

