రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు పట్టణంలోని కొత్తబజార్ మరియు
నరసరాంపేటలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గురువారం సందర్శించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బత్యాలని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


