పలమనేరు మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన కె. రాజన్న ను, డైరెక్టర్ ఎం.శంకరప్పను ఆదివారం వాల్మీకి సంఘ నేతలు కలిసి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇద్దరికీ శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ నామినేటెడ్ పదవులు లభించడం హర్షదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డికి వాల్మీకి సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ రాష్ట్ర నాయకులు, పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. భాస్కర్, అద్దాల నాగరాజు, నియోజకవర్గ నాయకులు రొంట కుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ ను సన్మానించిన వాల్మీకి సంఘ నేతలు!
పలమనేరు మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన కె. రాజన్న ను, డైరెక్టర్ ఎం.శంకరప్పను ఆదివారం వాల్మీకి సంఘ నేతలు కలిసి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇద్దరికీ శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ నామినేటెడ్ పదవులు లభించడం హర్షదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డికి వాల్మీకి సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ రాష్ట్ర నాయకులు, పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. భాస్కర్, అద్దాల నాగరాజు, నియోజకవర్గ నాయకులు రొంట కుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

