శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం, వేడం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో “భూమి హిత” పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, భూమిహితులకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా విచ్చలవిడిగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఇంటింటికీ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకమ్మ, ఆర్గనైజర్ కళ్యాణి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము సైతం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత-ప్రజా సాధికారిక ట్రస్ట్ పిలుపు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం, వేడం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో “భూమి హిత” పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, భూమిహితులకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా విచ్చలవిడిగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఇంటింటికీ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకమ్మ, ఆర్గనైజర్ కళ్యాణి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము సైతం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

