ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రికజిల్లా ఇంచార్జి)
ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగించేందుకు ఈ నిర్ణయం3 తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలబడటాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


