

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక పద్మావతి జూనియర్ కళాశాలలో వినాయక చవితి పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మరియు హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుని ప్రార్థించారు. ఉపాధ్యాయులు సైతం భక్తి నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ –“వినాయక చవితి పండుగ మనందరికీ శుభ ప్రారంభానికి సంకేతం. విఘ్నేశ్వరుని ఆరాధనతో మన మార్గంలోని అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు ఈ పండుగ ద్వారా శ్రద్ధ, క్రమశిక్షణ, సద్గుణాలను అలవరచుకోవాలి. గణనాథుని ఆశీస్సులు అందరి జీవితాల్లో సుఖశాంతులు, విజయాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు.పూజా కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేశారు

