ఈ రోజు కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ D. శ్రీనివాసులు చిట్వేల్ మరియు పెనగలూరు మండలాల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు నిష్పాక్షికంగా జరగాలని, ఎటువంటి కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని, అకతాయిలు తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.



