భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంటలు నీటి మునిగిన ముస్తాపురం, పాతాళపల్లి, గోవిందంపల్లి, ఉప్పలపాడు గ్రామాలో ఉండే పొలాలను సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించడం జరిగింది.రైతులు నాయకుల ముందర కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ తడిసిన ధాన్యాని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అన్నారు.అనంతసాగరం మండల లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలో కేవలం అధికార పార్టీ వారు చెప్పిన వారికే కొనుగోలు చేస్తున్నట్లు, తమ ధాన్యం కొనాలని రైతు అడిగితే మీరే మిల్లర్ లతో మాట్లాడుకోవాలని లేకుంటే దళారులకు అమ్ముకోవాలని చెబుతున్నారని, కొనుగోలు కేంద్రాలో లోడు ధాన్యం ఎత్తడానికి కమిషన్లు అడుగుతున్నారని తమ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వారికి సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జక్రయ్య,నాగులూరు వెంకటేష్, రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

-: పత్రిక ప్రకటన:- 22/10/25 *భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి*… *సిపిఎం పార్టీ ,రైతు సంఘం డిమాండ్* _____________________
భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంటలు నీటి మునిగిన ముస్తాపురం, పాతాళపల్లి, గోవిందంపల్లి, ఉప్పలపాడు గ్రామాలో ఉండే పొలాలను సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించడం జరిగింది.రైతులు నాయకుల ముందర కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ తడిసిన ధాన్యాని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అన్నారు.అనంతసాగరం మండల లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలో కేవలం అధికార పార్టీ వారు చెప్పిన వారికే కొనుగోలు చేస్తున్నట్లు, తమ ధాన్యం కొనాలని రైతు అడిగితే మీరే మిల్లర్ లతో మాట్లాడుకోవాలని లేకుంటే దళారులకు అమ్ముకోవాలని చెబుతున్నారని, కొనుగోలు కేంద్రాలో లోడు ధాన్యం ఎత్తడానికి కమిషన్లు అడుగుతున్నారని తమ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వారికి సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జక్రయ్య,నాగులూరు వెంకటేష్, రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

