శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవలి వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల తీవ్రమయ్యే అవకాశం వునందున సోమవారం నాడు జనసేన పార్టీ నాయకులు మునిసిపల్ కమిషనర్ ని కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా జన సైనికులు మాట్లాడుతూ…. పట్టణ ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచి ఫాగింగ్, శానిటేషన్, క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అదేవిధంగా పట్టణంలో కుక్కలు, పందుల బెడద తీవ్రంగా పెరుగుతుండటంతో, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడులకు గురవడం, పందులు రహదారులపై సంచరిస్తూ అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ సమస్యలను అరికట్టేందుకు కుక్కల పట్టి, టీకా కార్యక్రమాలు, పందుల నిర్మూలన చర్యలు తక్షణమే చేపట్టాలని మునిసిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, జయప్రకాష్, మాధవ మహేష్, దినేష్, సురేష్, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

పట్టణప్రజలు సీజనల్ వ్యాదులకు గురుకాకుండా చర్యలు తీసుకోవాలీ- జన సైనికులు
శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవలి వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల తీవ్రమయ్యే అవకాశం వునందున సోమవారం నాడు జనసేన పార్టీ నాయకులు మునిసిపల్ కమిషనర్ ని కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా జన సైనికులు మాట్లాడుతూ…. పట్టణ ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచి ఫాగింగ్, శానిటేషన్, క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అదేవిధంగా పట్టణంలో కుక్కలు, పందుల బెడద తీవ్రంగా పెరుగుతుండటంతో, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడులకు గురవడం, పందులు రహదారులపై సంచరిస్తూ అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ సమస్యలను అరికట్టేందుకు కుక్కల పట్టి, టీకా కార్యక్రమాలు, పందుల నిర్మూలన చర్యలు తక్షణమే చేపట్టాలని మునిసిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, జయప్రకాష్, మాధవ మహేష్, దినేష్, సురేష్, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

