కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి ప్రతినిధి 20 సెప్టెంబర్ పున్నమి న్యూస్. :
దసరా పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పోలీసులు ప్రజలకు ప్రకటన ద్వారా ఈ క్రింది కీలక సూచనలు చేశారు. ప్రయాణాల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి..రోడ్డు భద్రతా నియమాలను పాటించి, పరిమిత వేగంతో వాహ నాలు నడపాలి.మద్యం సేవించి డ్రైవింగ్ చేయవ ద్దు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో బంగారం, నగ దు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవ డం మంచిది. ఇరుగుపొరుగు వారికి ఇంటిని గమ నించమని చెప్పాలి.ఇంటిలోపల, బయట ఒక లైటు వేసి ఉంచాలి.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసు కోవడం వల్ల మొబైల్ నుంచే ఇంటిని చూసుకునే వీలుం టుంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలి.శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి.


