విశాఖపట్నం, అక్టోబర్ 25
పున్నమి ప్రతినిధి
ఏపీఎస్ఆర్టీసీ, విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో పంచారామాల యాత్ర బస్సు సర్వీస్ను విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ద్వారకా బస్ స్టేషన్ (9959225602) మరియు విశాఖపట్నం డిపో మేనేజర్ కార్యాలయం (9959225594) ను సంప్రదించవచ్చని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక టూర్లు అందుబాటులో ఉన్నాయని, కావలసిన టూర్ ప్యాకేజీలను పై నెంబర్ల ద్వారా తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు


