పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా దేవరపల్లి రఘురాం రెడ్డి నియామకం
ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారానికి చెందిన దేవరపల్లి రఘురాం రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగంలో రాష్ట్ర సెక్రటరీగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రఘురాం రెడ్డి గారు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన మాజీ మంత్రి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి, వారి తనయుడు యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డి గారికి, జలదంకి మండల పార్టీ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి విజయానికి, అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


