విశాఖపట్నం, అక్టోబర్ 25:
విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పంచరామాలు యాత్ర మరియు స్వామి అయ్యప్ప యాత్రకు సంబంధించి గోడపత్రిక విడుదల జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ ఎ. గంగాధర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (DBSC) గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, విశాఖపట్నం డిపో మేనేజర్ మణి మాధురి, అసిస్టెంట్ మేనేజర్ ఉజ్వల, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) జి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు మాట్లాడుతూ, పంచరామాలు మరియు అయ్యప్ప యాత్రలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణ టిక్కెట్లను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముందుగానే రిజర్వ్ చేసుకొని సుఖంగా, సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు


