తొట్టంబేడు జనవరి 31, పున్నమి న్యూస్ : దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహ కారంతో వివిధ కృత్యాలను చేసారు. అంకెలతో ఇల్లు,తెలుగు అక్షరాలతో చెట్టు, ఆంగ్ల అక్షరరాతో నెమలి, మొదలగు చిత్రాలను తయారు చేసారు. పద్యాలతో పాటలు, కుర్చీలతో ఆటలు ఆడి రోజంతా ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే ఉండటం వలన వారం అంతా అభ్యసన ఒత్తిడి లేకుండా ఆ రోజంతా వారి అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలను వెలికితీయవచ్చునని, విద్యార్థులకు మానసిక, శారీరక ఆనందానికి ఈ కార్యక్రమం బాగా ఉపయుక్తంగా ఉంటుం దన్నారు.



