*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
జగన్నాధ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం..
ప్రస్తుతం
నైరుతి -ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంథా తుఫాన్
విశాఖ కు దక్షిణ ఆగ్నేయంగా 600కిలోమీటర్లు
కాకినాడ కు దక్షిణ ఆగ్నేయంగా 570కిలోమీటర్ల
చెన్నయి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల
పోర్ట్ బ్లెయర్ కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో మొంథా తుఫాన్ కేంద్రీకృతమైంది.
ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి
రాగాల 12గంటల్లో -పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం.
ఈ తుఫాన్ 28 వ తేదీ సాయంత్రం గాని ,రాత్రి గాని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ గానే తీరం దాటే అవకాశం.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110, కిలోమీటర్లు
వేగంతో ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉంది .
.
ఈ రోజు రాష్ట్రం లో అత్యధిక ప్రాంతంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి.
విజయనగరం
విశాఖ
కాకినాడ
కృష్ణ
బాపట్ల
నెల్లూరు జిల్లాలో
కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
శ్రీకాకుళం
అల్లూరి
యన్ టి ఆర్
తిరుపతి
నంద్యాల లో
అతి భారీ వర్ష సూచన.
రేపు
శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా లో అతి భారీ వర్ష సూచన ఉంది.రెడ్ అలెర్ట్ జారీ
ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా లో భారీ నుంచి అతి భారీ వర్షం ఉంటుంది.
ఈ రోజు తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు ఉంటాయి.
రేపు ఈదురు గాలులు వేగం పెరుగుతుంది.80 నుంచి 90 వరకు వేగంతో ఈ గాలులు ఉంటాయి.
రాష్ట్రం లో చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ..ప్రమాదం పొంచి ఉంది.


