పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి
నేల కొండపల్లి మండలం
నేలకొండపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. కొత్తకోత్తూరు గ్రామ రైతు మాలోతు హనుమా పొలాన్ని సందర్శించిన ఆయన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ లభిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయ స్థిరీకరణ, మెరుగైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు, సయ్యద్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


