శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వాటి పరిష్కారానికై ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబడింది. శుక్రవారం నాడు ఉదయం 9:00 గంటలకు రేణిగుంట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజాదరణ పొందుతుంది.

నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొజ్జల ప్రజాదర్బార్
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వాటి పరిష్కారానికై ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబడింది. శుక్రవారం నాడు ఉదయం 9:00 గంటలకు రేణిగుంట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజాదరణ పొందుతుంది.

