నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ,బోరబండ, యూసఫ్ గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, MLC రాములు నాయక్,మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి గార్లు ఇంటింటి ప్రచారం నిర్వహించినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ, స్థానికులతో మాట్లాడిన వారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్న గారిని గెలిపించాలి. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేయండి అని కోరారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్స్ లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జితేందర్ ప్రేమ కుమార్, విజయ రెడ్డి,నాగార్జున్, ఆనంద్ రావు,మహిళా నాయకురాలు సావిత్రి, నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనారు


