నెల్లూరు — పున్నమి ప్రతినిధి
నెల్లూరు నగర మేయర్గా ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించిన రూపుకుమార్ యాదవ్కు బేడ బుడగ జంగమ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత నగర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథరామయ్య, కల్పం రమేష్, ఉద్దండి అమరలింగం, కందుకూరి అంకలింగం, చేజర్ల సుధాకర్, ఉద్దండి కోటేష్, పంచాక్షరి మల్లయ్య, ముత్యాల పిచ్చయ్య, కల్పం శ్రీనివాసులు, గంధవల్ల ఉమాశంకర్ పాల్గొన్నారు.


