రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు ప్రాంతీయ పశు వైద్యుశాల నందు నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్. పి.యల్ నరసింహ రావు ఆధ్వర్యంలో సమావేశము జరిగినది ఇందీలో ముఖ్యముగా గాలికుంటు వ్యాధి కి సంబంధించి టీకాలు వేయడం అలాగే ఐ ఎన్ ఏ పి హెచ్ కమ్మలు పశువులకు వేయడం మొదలైన వాటి మీద సమీక్ష నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమము NADCP లో భాగంగా దేశం మొత్తం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఫిబ్రవరి 2017 న ప్రారంభించడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి పశువులకు చెవి కమ్మ వేసి గాలికుంటు టీకాలు వేసి ఆన్లైన్ చేయవలసి ఉన్నది 22 మార్చి 2020 నుండి కోవిడ్-19 కారణంగా ఈ టీకాల కార్యక్రమము అర్ధాంతరంగా నిలిచిపోయింది మరలా లాక్ డౌన్ సరలింపు ఇచ్చినందున ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగినది. కానీ ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో టీకాల కార్యక్రమం నెమ్మదిగా జరుగుతున్నదని సిబ్బందిని ఉత్తేజపరచి తిరిగి పూర్తి వేగాన్ని అందుకునే విధంగా ప్రోత్సహించాలని 100% టీకాలు కార్యక్రమమును పూర్తి చేయవలసిందిగా సిబ్బందికి నిర్దేశిక ప్రణాళికలను తెలియజేశారు తదుపరి రైతు భరోసా కేంద్రాల నందు పశు ఆరోగ్య గుర్తింపు కార్డులను అందించడం జరిగిందని ఈ సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశానికి రాపూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ సి హెచ్ రామచంద్ర రావు, సైదాపురం మరియు గిద్దలూరు, సంక్రాంతి పల్లి పశు వైద్యాధికారులు డాక్టర్ బొడ్డు ప్రసాద్, డాక్టర్ నాగార్జున దీపక్,డాక్టర్ మహిత తేజ్,VLO లు ఎం ప్రసాద్, మురళీకృష్ణ, L Aవిజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్. పి.యల్ నరసింహ రావు ఆధ్వర్యంలో సమావేశము
రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు ప్రాంతీయ పశు వైద్యుశాల నందు నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్. పి.యల్ నరసింహ రావు ఆధ్వర్యంలో సమావేశము జరిగినది ఇందీలో ముఖ్యముగా గాలికుంటు వ్యాధి కి సంబంధించి టీకాలు వేయడం అలాగే ఐ ఎన్ ఏ పి హెచ్ కమ్మలు పశువులకు వేయడం మొదలైన వాటి మీద సమీక్ష నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమము NADCP లో భాగంగా దేశం మొత్తం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఫిబ్రవరి 2017 న ప్రారంభించడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి పశువులకు చెవి కమ్మ వేసి గాలికుంటు టీకాలు వేసి ఆన్లైన్ చేయవలసి ఉన్నది 22 మార్చి 2020 నుండి కోవిడ్-19 కారణంగా ఈ టీకాల కార్యక్రమము అర్ధాంతరంగా నిలిచిపోయింది మరలా లాక్ డౌన్ సరలింపు ఇచ్చినందున ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగినది. కానీ ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో టీకాల కార్యక్రమం నెమ్మదిగా జరుగుతున్నదని సిబ్బందిని ఉత్తేజపరచి తిరిగి పూర్తి వేగాన్ని అందుకునే విధంగా ప్రోత్సహించాలని 100% టీకాలు కార్యక్రమమును పూర్తి చేయవలసిందిగా సిబ్బందికి నిర్దేశిక ప్రణాళికలను తెలియజేశారు తదుపరి రైతు భరోసా కేంద్రాల నందు పశు ఆరోగ్య గుర్తింపు కార్డులను అందించడం జరిగిందని ఈ సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశానికి రాపూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ సి హెచ్ రామచంద్ర రావు, సైదాపురం మరియు గిద్దలూరు, సంక్రాంతి పల్లి పశు వైద్యాధికారులు డాక్టర్ బొడ్డు ప్రసాద్, డాక్టర్ నాగార్జున దీపక్,డాక్టర్ మహిత తేజ్,VLO లు ఎం ప్రసాద్, మురళీకృష్ణ, L Aవిజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

