పున్నమి ప్రతినిధి | నెల్లూరు | 07-01-2026
నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణ లక్ష్యంగా డ్రోన్ నిఘాను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) సూచనలతో డీఎస్పీల పర్యవేక్షణలో పట్టణ, శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్లతో క్షుణ్ణ పరిశీలన కొనసాగుతోంది. ఉదయం 9–11, సాయంత్రం 4–6 గంటల పాటు, టౌన్ పరిసరాల్లో రాత్రి 7–9 వరకు నిఘా ఏర్పాటు చేశారు. ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ 1972కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


