పెద్ద అవుటపల్లి(ఉంగుటూరు మండలం): జనవరి 1 పున్నమి ప్రతినిధి
నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఉంగుటూరు మండల ప్రజలకు మరియు భక్తులకు పెద్ద అవుటపల్లి ష్రైన్ రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు (ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఓఎఫ్ఎం క్యాప్.) తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, గడిచిన కాలంలోని బాధలను, ఆందోళనలను మర్చిపోయి.. సరికొత్త ఆశలతో, ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం సరికొత్త అవకాశాలకు వేదిక కావాలని, ప్రతి ఒక్కరూ తమ అంచనాలను అందుకునేలా కృషి చేయాలని కోరారు.
ప్రేమ, ఆప్యాయతలతో ముందుకు సాగాలి:
మన చుట్టూ ఉన్న వారందరినీ సంతోషపరుస్తూ, నలుగురికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన నూతన సంవత్సర వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సుఖసంతోషాలతో కూడిన ఉజ్వల భవిష్యత్తును గడపాలని ఆయన ఆశీర్వదించారు.



