పున్నమి ప్రతినిధి 18 ఫిబ్రవరి తిరుపతి
తిరుపతి నగర శివార్లలో నూతనంగా నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమి పూజ పనులను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ నూతన కార్యాలయం నిలవబోతోంది.
అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లోకేష్ గారి మార్గదర్శకత్వంలో కార్యకర్తలకు సకల సౌకర్యాలు ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నాం.
భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం కేంద్ర బిందువు కానుంది,అత్యాధునిక వసతులతో, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ భవనం రూపుదిద్దుకోనుంది.
వేదిక ఏర్పాటు, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు




