దీపావలి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలి..జాగ్రత్తలు పాటించి పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి..!రాష్ట్ర ప్రజలందరికీ ఈ దీపావళి పర్వదినం సంతోషాల సంబరం కావాలని, అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని వింజమూరు టిడిపి మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆకాంక్షించారు.
దీపావళి పండుగ సందర్భంగా నరసారెడ్డి ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.
మన రాష్ట్రం మరోసారి వెలుగులదివ్వెలా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని, ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ కృషి మరువలేనిదని గూడా నరసారెడ్డి అన్నారు.
ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.


