Monday, 6 April 2026
  • Home  
  • నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీల్లో ‘శ్రీ చైతన్య’ ప్రతిభ.. ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ కైవసం.
- తిరుపతి

నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీల్లో ‘శ్రీ చైతన్య’ ప్రతిభ.. ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ కైవసం.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 06 (పున్నమి న్యూస్): అంతరిక్ష విజ్ఞాన రంగంలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రపంచస్థాయిలో సత్తా చాటారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన అమెరికా ఎన్.ఎస్.ఎస్ (నాసా స్పేస్ సెటిల్‌మెంట్ – కాంటెస్ట్ 2026) పోటీల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తమ మేధస్సు, పట్టుదలతో రూపొందించిన ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.విద్యార్థులు రూపొందించిన ‘ఎంపీరియా-ఇన్’ (స్పేస్ హోటల్) ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ లభించిందని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మొత్తం 31 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 134 విన్నింగ్ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అందులో భారత్ 80 అవార్డులు సాధించగా, ఏకంగా 57 అవార్డులు శ్రీచైతన్య విద్యాసంస్థలకే దక్కడం విశేషం” అని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై తమ విద్యాసంస్థల విద్యార్థులు సాధించిన ఈ ఘనత దేశానికే గర్వకారణమని ఏజీఎం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దు అని విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్‌ఛార్జులు శ్రీహరి, వంశీ, నాసా ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 06 (పున్నమి న్యూస్): అంతరిక్ష విజ్ఞాన రంగంలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రపంచస్థాయిలో సత్తా చాటారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన అమెరికా ఎన్.ఎస్.ఎస్ (నాసా స్పేస్ సెటిల్‌మెంట్ – కాంటెస్ట్ 2026) పోటీల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తమ మేధస్సు, పట్టుదలతో రూపొందించిన ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.విద్యార్థులు రూపొందించిన ‘ఎంపీరియా-ఇన్’ (స్పేస్ హోటల్) ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ లభించిందని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మొత్తం 31 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 134 విన్నింగ్ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అందులో భారత్ 80 అవార్డులు సాధించగా, ఏకంగా 57 అవార్డులు శ్రీచైతన్య విద్యాసంస్థలకే దక్కడం విశేషం” అని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై తమ విద్యాసంస్థల విద్యార్థులు సాధించిన ఈ ఘనత దేశానికే గర్వకారణమని ఏజీఎం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దు అని విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్‌ఛార్జులు శ్రీహరి, వంశీ, నాసా ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.