శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు గల అన్ని ఓరియంటేషన్ విద్యార్థులకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సంస్థ వారు నిర్వహించిన పరీక్షలో 21 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ NASA వారి తరపున పాఠశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ… నాసా వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి గుర్తింపు పొందేలా ఎంపిక అయిన విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేయాలని, అది వారి ప్రతిభకు నిదర్శనంగా ఎంపిక కావాలని నాసా సంస్థ వారు విద్యార్థులకు కేటాయించినటువంటి కిట్లను వారికి అందించడం నాకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం ఎ.జి.ఎం సురేష్ మాట్లాడుతూ….ఈ గుర్తింపు మరందరో విద్యార్థులకు ప్రేరణగా నిలిచి గొప్ప లక్ష్యాల వైపు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, S – Batch ఇన్చార్జ్ శ్రీహరి, నాసా ఇంచార్జ్ కవిత పాల్గొన్నారు.

నాసా పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన శ్రీ చైతన్య విద్యార్థులు
శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు గల అన్ని ఓరియంటేషన్ విద్యార్థులకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సంస్థ వారు నిర్వహించిన పరీక్షలో 21 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ NASA వారి తరపున పాఠశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ… నాసా వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి గుర్తింపు పొందేలా ఎంపిక అయిన విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేయాలని, అది వారి ప్రతిభకు నిదర్శనంగా ఎంపిక కావాలని నాసా సంస్థ వారు విద్యార్థులకు కేటాయించినటువంటి కిట్లను వారికి అందించడం నాకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం ఎ.జి.ఎం సురేష్ మాట్లాడుతూ….ఈ గుర్తింపు మరందరో విద్యార్థులకు ప్రేరణగా నిలిచి గొప్ప లక్ష్యాల వైపు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, S – Batch ఇన్చార్జ్ శ్రీహరి, నాసా ఇంచార్జ్ కవిత పాల్గొన్నారు.

