పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11
నాగర్ కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రధానమంత్రి దన్ ధాన్య యోజన మరియు పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశు సంపద మత్స్య సంపద ఆహార పదార్థాలకు విలువ జోడింపు వంటి రంగాలలో 1100 కు పైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ ప్రారంభించి శంకుస్థాపన చేశారు.
ఈ పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు
పంట దిగుబడుల పెంపు, పంట వైవిధ్యానికి ప్రోత్సాహకం, గ్రామస్థాయిలో నిల్వ గోదాముల ఏర్పాటు, నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి, రైతులకు తక్షణ దీర్ఘకాలిక రుణాల లభ్యత, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు తెలుపుతుందని తెలిపారు. మరియు ఈ పథకం ప్రధాన లక్ష్యం
జిల్లాస్థాయి యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి గ్రామ రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయానికి లాభదాయకంగా మలచడం. మన నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా రైతులందరూ ఈ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.


