నిర్మల్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి )
నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని ముఠాపూర్ గ్రామంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పంట పొలంలో నీరు చేరి వరి పంటకు చాలా నష్టం జరిగింది. పంట నష్టాన్ని అంచనా వేయడానికి నిర్మల్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ గారు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించడం జరిగింది, ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా పొలాలలో నీరు చేరి పంట నష్టము చాలానే జరిగినందున ప్రభుత్వము రైతుల రైతుల వద్ద నుండి తడిసిన ధాన్యాన్ని కూడా ఇలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వరికి మద్దతు ధరను కూడా తగ్గించకుండా గిట్టుబాటు ధరనే రైతుకు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు వినోద్, సాధిక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


