నవంబర్ 26 న రాజ్యాంగం అమలు దినోత్సవం నడిగడ్డలో మహా ర్యాలీనీ విజయవంతం చేయండి
భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్
జోగులాంబ గద్వాల జిల్లా:ఈ నెల నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే మహా ర్యాలీని విజయవంతం* చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు, భారత రాజ్యాంగాన్ని కాపాడండి సోదర భావాన్ని నిర్మించండి,,, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రక్షించుకోవడం మన బాధ్యతనీ ప్రతి పౌరుడు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ప్రతి గ్రామ, గ్రామానికి వెళ్లి సమావేశాలు నిర్వహించి రాజ్యాంగ హక్కుల గురించి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించాలనీ అన్నారు, భారత రాజ్యాంగ అమలు దినోత్సవ మహా ర్యాలీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల నవంబర్ 26 తేదీన ఉదయం 10 గంటల నుండి అంబేద్కర్ చౌరస్తా నుండి విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున తరలివచ్చి విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు వర్షిత్, ఉపాధ్యక్షులు పుట్ట ప్రసాద్, ధరూర్ మండల అధ్యక్షుడు ఈదన్న,జిల్లా భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్,శ్రీను, ఆంజనేయులు, సూరి బాబు తదితరులు


