Thursday, 5 February 2026
  • Home  
  • నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన దీక్షలు 
- Featured - ఆంధ్రప్రదేశ్ - గూడూరు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన దీక్షలు 

  (గూడూరు పున్నమి ప్రతినిధి) :  స్థానిక పెద్ద మశీదు ఎదుట నల్ల చట్టాలకు నిరసనగా చేపట్టిన దీక్షలు ఆదివారం 23వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 20 మంది ముస్లిం, హిందూ సోదరులుకూర్ఛున్నారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు  షేక్ రాహుల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు నల్ల చట్టాలపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. కేవలంముస్లింలు మాత్రమే కాకుండా ఈ చట్టాలతో దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.లౌకిక దేశంగా గొప్ప ప్రజాస్వామ్య వ్య్వవస్థ గా  పేరుకలిగిన భారతదేశం నేడు ఈ నల్ల చట్టాల వలన తలదించుకొనే పరిస్థితి వచిందని రాహుల్  ఆవేదన వెలిబుచ్చారు.అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలలో అభద్రతా భావంఏర్పడిందని దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజలందరు ఒకేతాటిపై నడిచి ఈ నల్ల చట్టాలను రూపుమాపాలని కోరారు.     మైనారిటీ నాయకులు ముజాహిద్ మాట్లాడుతూ దేశంలోపుట్టి పెరిగిన వారు దేశ పౌరులుగా నిరూపించుకునే దౌర్భాగ్యం మరే దేశంలోనూ లేదన్నారు. కేవలం హిందూత్వను అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నల్ల చట్టాలు తీసుకువచ్చారని బీజేపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఆర్సీ సీఏఏ,  ఎన్పిఆర్ లను రద్దుచేసేంత వరకు  శాంతియుత నిరసన పోరాటాలను ఆపేది లేదన్నారు. ఈ దీక్షలో మన్సూర్, కలీం, హరీ, శ్రీకాంత్, సాధిక్, ఈశ్వర్, షాహిద్, ఫారూఖ్, జునేద్, యశ్వంత్, దావూద్, సాయి, ఇనాముల్, షఫీ మౌలానా, మాబాష, జవాద్ తో పాటు  భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  (గూడూరు పున్నమి ప్రతినిధి) :  స్థానిక పెద్ద మశీదు ఎదుట నల్ల చట్టాలకు నిరసనగా చేపట్టిన దీక్షలు ఆదివారం 23వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 20 మంది ముస్లిం, హిందూ సోదరులుకూర్ఛున్నారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు  షేక్ రాహుల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు నల్ల చట్టాలపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. కేవలంముస్లింలు మాత్రమే కాకుండా ఈ చట్టాలతో దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.లౌకిక దేశంగా గొప్ప ప్రజాస్వామ్య వ్య్వవస్థ గా  పేరుకలిగిన భారతదేశం నేడు ఈ నల్ల చట్టాల వలన తలదించుకొనే పరిస్థితి వచిందని రాహుల్  ఆవేదన వెలిబుచ్చారు.అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలలో అభద్రతా భావంఏర్పడిందని దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజలందరు ఒకేతాటిపై నడిచి ఈ నల్ల చట్టాలను రూపుమాపాలని కోరారు.     మైనారిటీ నాయకులు ముజాహిద్ మాట్లాడుతూ దేశంలోపుట్టి పెరిగిన వారు దేశ పౌరులుగా నిరూపించుకునే దౌర్భాగ్యం మరే దేశంలోనూ లేదన్నారు. కేవలం హిందూత్వను అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నల్ల చట్టాలు తీసుకువచ్చారని బీజేపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఆర్సీ సీఏఏ,  ఎన్పిఆర్ లను రద్దుచేసేంత వరకు  శాంతియుత నిరసన పోరాటాలను ఆపేది లేదన్నారు. ఈ దీక్షలో మన్సూర్, కలీం, హరీ, శ్రీకాంత్, సాధిక్, ఈశ్వర్, షాహిద్, ఫారూఖ్, జునేద్, యశ్వంత్, దావూద్, సాయి, ఇనాముల్, షఫీ మౌలానా, మాబాష, జవాద్ తో పాటు  భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.