అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించబడింది
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రావు మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ జీవన విధానంలో మార్పు తీసుకురావాలని, ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు.
తప్పుడు మార్గాల్లో నడిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఇన్స్పెక్టర్, పోలీసు శాఖ తరఫున రౌడీషీటర్లను సత్సంప్రదాయాల వైపు నడిపించే కృషి కొనసాగుతుందని తెలిపారు.


