
సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్చేసి, కొవ్వొత్తులు ఆర్పి, పూలతో శుభాకాంక్షలు అందుకోవడమే. కానీ తెలుగు కవిరత్న పొట్నూరు గిరీష్ గారి ఆలోచన మాత్రం భిన్నం. ఆయనకు పుట్టినరోజు అంటే సేవకు సంకేతం, మానవత్వానికి ముద్ర, రక్తపు చుక్కతో ప్రాణపు దీపం వెలిగించడం. సేవను వేడుకగా మార్చిన కవి 13 సెప్టెంబర్ 2025న గిరీష్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజును ఆయన వ్యక్తిగత ఆనందంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మార్చుకున్నారు. “జన్మదినం అనేది ఒక్కరి పుట్టుకకే కాదు, మరొకరి ప్రాణానికి పునర్జన్మ ఇవ్వగల రోజు” అనే నమ్మకంతో ఆయన ముందుకొచ్చారు. మోక్ష బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలోఈ స్ఫూర్తిదాయక ఆలోచనతో 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం) న నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయం వేదికగా మెగా రక్తదాన శిబిరం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని మోక్ష బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శతాధిక రక్తదాతలు పాల్గొనబోతున్నారు. రక్తదానం – రక్తస్నానం కాదు, రక్షణ. రక్తదానం చేయడం అంటే మనం ఏదైనా కోల్పోవడం కాదు; ఒకరి ప్రాణాన్ని కాపాడడం. మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే చుక్కలతో, మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. ఇదే “రక్తదానం మహాదానం” అన్న తాత్పర్యం.
నిర్వాహకులు మాట్లాడుతూ –”మన రక్తం మరొకరి శిరాలో ప్రవహించి ప్రాణం కాపాడినప్పుడు, అదే నిజమైన పుట్టినరోజు ఉత్సవం అవుతుంది. గిరీష్ గారి ఆలోచన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
రక్తదానం చేయదలచిన వారు గిరీష్ బ్లడ్ వింగ్ – 8333083883ను సంప్రదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
🌹 ఒక చిన్న కవితా స్పర్శ 🌹
జన్మదినం జ్ఞాపకం కాదు, జన్మదానం కావాలి, రక్తపు చుక్క రేపటి ఆశను వెలిగించాలి.

