నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం
యాభై వేలు రూపాయలు (50,000/)
సింధం మమత – రవి దంపతులు
పున్నమి న్యూస్ ప్రతినిధి
12 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్
నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *సింధం మమత – రవి* దంపతులు యాభై వేలు రూపాయలు (50,000/-) ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.




