Thursday, 5 February 2026
  • Home  
  • నంద్యాలలో యూరాలజీ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు
- Blog

నంద్యాలలో యూరాలజీ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు

నంద్యాల యూరాలజీ వైద్యుల సంఘం,కర్నూలు యూరాలజీ వైద్యుల సంఘం సంయుక్త నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాల 37 వ వార్షిక యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు ఈనెల 8,9 వ తేదీలలో నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు నంద్యాల కు చెందిన యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ తో కలిసి శుక్రవారం స్థానిక ఐఎంఏ కార్యాలయంలో సదస్సు వివరాల పుస్తకాలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి,నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దాసరి రమేష్,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ప్రతిష్టాత్మకమైన రెండు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య,కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్,కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో జరిగే సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాలు,దేశంలోని వివిధ నగరాలకు చెందిన 25 మంది ప్రముఖ యూరాలజీ నిపుణులు వివిధ అంశాలపై సదస్సులో ప్రసంగిస్తారని, యూరాలజీ విభాగ పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, చికిత్సా విధానాలపై చర్చా గోస్టులు నిర్వహిస్తామన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మంది యూరాలజీ వైద్య నిపుణులు ఈ సదస్సులో ప్రతినిధులుగా నమోదు చేసుకుని పాల్గొంటున్నారని తెలిపారు.శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్, ఉస్మానియా ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్,తెలుగు రాష్ట్రాలలో యూరాలజీ విభాగ ఆద్యులు డాక్టర్ విక్రమసింహారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిధులుగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ యూరాలజీ విభాగంలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాల గురించి యూరాలజీ చికిత్సలు అందిస్తున్న వైద్యులకు అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం నంద్యాల వైద్యులకు గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి రమేష్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

నంద్యాల యూరాలజీ వైద్యుల సంఘం,కర్నూలు యూరాలజీ వైద్యుల సంఘం సంయుక్త నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాల 37 వ వార్షిక యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు ఈనెల 8,9 వ తేదీలలో నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు నంద్యాల కు చెందిన యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ తో కలిసి శుక్రవారం స్థానిక ఐఎంఏ కార్యాలయంలో సదస్సు వివరాల పుస్తకాలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి,నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దాసరి రమేష్,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ప్రతిష్టాత్మకమైన రెండు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య,కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్,కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో జరిగే సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాలు,దేశంలోని వివిధ నగరాలకు చెందిన 25 మంది ప్రముఖ యూరాలజీ నిపుణులు వివిధ అంశాలపై సదస్సులో ప్రసంగిస్తారని, యూరాలజీ విభాగ పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, చికిత్సా విధానాలపై చర్చా గోస్టులు నిర్వహిస్తామన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మంది యూరాలజీ వైద్య నిపుణులు ఈ సదస్సులో ప్రతినిధులుగా నమోదు చేసుకుని పాల్గొంటున్నారని తెలిపారు.శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్, ఉస్మానియా ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్,తెలుగు రాష్ట్రాలలో యూరాలజీ విభాగ ఆద్యులు డాక్టర్ విక్రమసింహారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిధులుగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ యూరాలజీ విభాగంలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాల గురించి యూరాలజీ చికిత్సలు అందిస్తున్న వైద్యులకు అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం నంద్యాల వైద్యులకు గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి రమేష్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.