నందిగామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం నందిగామ పట్టణం లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు అవతూ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.జగన్మోహనరావు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేత లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటు, పరిశీలకుల నియామకం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలు, గ్రామస్థాయి నాయకులు తది తరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
నందిగామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం నందిగామ పట్టణం లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు అవతూ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.జగన్మోహనరావు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేత లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటు, పరిశీలకుల నియామకం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలు, గ్రామస్థాయి నాయకులు తది తరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

