శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ నందు కోడియోటిక్ ఎడుటెక్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – రోబోటిక్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు జె.పవార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.విశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ద స్కూల్ విద్యార్థులు అత్యాధునిక ఏ ఐ – రోబోటిక్స్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు చేశారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ఏఐ టెక్నాలజీని వినియోగించి రోబోలతో ఏ విధంగా పనిచేయించుకోవచ్చోచూపించి అబ్బురపరిచారు. సీసీ కెమెరాలు బదులు ఏ ఐ టెక్నాలజీతో ఫోను ద్వారానే పరిసరాలను నిఘాలో ఉంచడం వంటి నూతన ఆవిష్కరణలను చేశారు. రాబోయే ఆధునిక కాలంలో టెక్నాలజీతో రోబోటిక్ సమాజాన్ని సృష్టించే విధంగా విద్యార్థులు వినూత ఆలోచనలతో ఆకట్టుకున్నారు. ఏ ఐ రోబోటిక్ ఎక్స్ పోను తిలకించిన తల్లిదండ్రులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను అభినందించి ప్రశంసించారు. ద స్కూల్లో ప్రతివారం రెండు రోజులు పాటు ఏఐ -రోబోటిక్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించి, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల నిరవహుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లి, తండ్రులు పాల్గొన్నారు.

ద స్కూల్ లో రోబోటిక్స్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ నందు కోడియోటిక్ ఎడుటెక్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – రోబోటిక్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు జె.పవార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.విశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ద స్కూల్ విద్యార్థులు అత్యాధునిక ఏ ఐ – రోబోటిక్స్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు చేశారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ఏఐ టెక్నాలజీని వినియోగించి రోబోలతో ఏ విధంగా పనిచేయించుకోవచ్చోచూపించి అబ్బురపరిచారు. సీసీ కెమెరాలు బదులు ఏ ఐ టెక్నాలజీతో ఫోను ద్వారానే పరిసరాలను నిఘాలో ఉంచడం వంటి నూతన ఆవిష్కరణలను చేశారు. రాబోయే ఆధునిక కాలంలో టెక్నాలజీతో రోబోటిక్ సమాజాన్ని సృష్టించే విధంగా విద్యార్థులు వినూత ఆలోచనలతో ఆకట్టుకున్నారు. ఏ ఐ రోబోటిక్ ఎక్స్ పోను తిలకించిన తల్లిదండ్రులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను అభినందించి ప్రశంసించారు. ద స్కూల్లో ప్రతివారం రెండు రోజులు పాటు ఏఐ -రోబోటిక్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించి, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల నిరవహుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లి, తండ్రులు పాల్గొన్నారు.

