దేశ ప్రగతి బి.జె.పి తోనే సాధ్యం

    0
    298


    మనుబోలు (పున్నమి విలేఖరి)21, మార్చి:త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భాజపా నాయకులు కోరినారు కుడితపల్లి గ్రామం నందు ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించి త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరినారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి నిత్యవసర సరుకులు అందజేసిందని అన్నారు కావున ప్రజలందరూ త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు మాధవి ,స్వాతి, శిల్ప జ్యోతి ,ధనలక్ష్మి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మండల అధ్యక్షుడు ఒడూరు శ్రీనివాసులు రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి ,శేఖర్ ,వెంకయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

    0
    0