Friday, 27 March 2026
  • Home  
  • *దేశంలో తీవ్రవాదం కొత్తదారుల్లో ప్రారంభం కావడం దురదృష్టకరం * –సామాజిక భద్రత మనందరి ప్రధమ కర్తవ్యం – శ్రీరాములు అందెల*
- రంగారెడ్డి

*దేశంలో తీవ్రవాదం కొత్తదారుల్లో ప్రారంభం కావడం దురదృష్టకరం * –సామాజిక భద్రత మనందరి ప్రధమ కర్తవ్యం – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : ఢిల్లీ మరియు శ్రీనగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో శ్రీరాములు మాట్లాడుతూ దేశ భద్రత మన అందరి సామాజిక బాధ్యత అని దేశంలో తీవ్రవాదం కొత్త దారుల్లో ఆరంభం కావడం దురదృష్టకరమని, ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు కూడా ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మన పరిసరాల్లో, కాలనీలలో, గ్రామాల్లో అపరిచిత వస్తువులు, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. మన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అనాధికారికంగా విదేశీ వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో, మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు, మరియు ప్రజలంతా కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సదస్సుల్లో—భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనుమానాస్పద విషయాలను సంబంధిత అధికారులకు ఎలా తెలియజేయాలి కాలనీలు, పంచాయతీలు స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి, సమిష్టిగా చర్యలు తీసుకుంటే మన సమాజం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు.మన దేశ భద్రత మన బాధ్యత.మన మహేశ్వరం నియోజకవర్గాన్ని మన చేతులలో భద్రంగా ఉంచుకుందాం అని అన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : ఢిల్లీ మరియు శ్రీనగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో శ్రీరాములు మాట్లాడుతూ దేశ భద్రత మన అందరి సామాజిక బాధ్యత అని దేశంలో తీవ్రవాదం కొత్త దారుల్లో ఆరంభం కావడం దురదృష్టకరమని, ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు కూడా ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మన పరిసరాల్లో, కాలనీలలో, గ్రామాల్లో అపరిచిత వస్తువులు, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. మన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అనాధికారికంగా విదేశీ వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో, మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు, మరియు ప్రజలంతా కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సదస్సుల్లో—భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనుమానాస్పద విషయాలను సంబంధిత అధికారులకు ఎలా తెలియజేయాలి కాలనీలు, పంచాయతీలు స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి, సమిష్టిగా చర్యలు తీసుకుంటే మన సమాజం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు.మన దేశ భద్రత మన బాధ్యత.మన మహేశ్వరం నియోజకవర్గాన్ని మన చేతులలో భద్రంగా ఉంచుకుందాం అని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.