ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ – “అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి” అని ఆకాంక్షించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేను సాదరంగా స్వాగతించి, వేదపండితులు ఆశీర్వదించి, అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేశారు.


