నెల్లూరు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎస్పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు వెంటనే రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బి. శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.



